వైకాపా నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ప్రకటించారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలున్నాయి. ఇటీవల బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. తాజాగా ఆర్.కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైకాపా బలం 8కి పడిపోయింది.
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా !
الثلاثاء، 24 سبتمبر 2024
Andhra Pradesh రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా రాజ్యసభలో వైకాపా బలం 8కి పడిపోయింది వైకాపా నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య
ليست هناك تعليقات:
إرسال تعليق