ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పాత పేర్ల పునరుద్ధరణ చేసింది. ఆయా ప్రాజెక్టులకు వాస్తవ పేర్లనే పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌ సహా కొందరి వైసీపీ నేతల పేర్లు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు గతంలో జగన్ ప్రభుత్వం పెట్టింది. గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాన్యుమెంటల్‌పై ఉన్న జగన్ పేరును తొలిగించారు. మొన్న అర్ధరాత్రి లైట్లు ఆపేసి జగన్ పేరును నగర పాలక సిబ్బంది తొలిగించింది. పోలీసుల సమక్షంలోనే లైట్లు ఆర్పి జగన్ పేరు తొలగించడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2024లో అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రారంభించారు. రూ. 400 కోట్లతో 125 అడుగుల విగ్రహాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన సంగతి తెలిసిందే.

Post a Comment

أحدث أقدم