ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో మూడు రోజులపాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్ పర్యటించనున్నారు. కడప ఎయిర్పోర్ట్కు చేరుకున్న జగన్కు ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాచునూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నాయకుడు చంద్రారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఉదయం పులివెందులలోని వైసీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినితులను స్వీకరించినన్నారు. సెప్టెంబర్ రెండో తేదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ముగించుకుని తాడేపల్లికి తిరుగుపయనం కానున్నారు.
0 Comments