వారాంతాల్లో ఆటో నడుపుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ?


బెంగళూరులో వారాంతాల్లో ఓ మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆటో నడుపుతున్న సంఘటన చోటు చేసుకుంది. మైక్రోసాఫ్ట్ సీనియర్ ఇంజనీర్ వారాంతాల్లో తన ఒంటరితనాన్ని అధిగమించడానికి ఆటో రిక్షా నడుపుతూ వెంకటేష్ గుప్తా అనే ప్రయాణికుడి కెమెరాకి చిక్కాడు. ఈ విషయాన్ని ఆ ప్రయాణికుడు ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. 'వారాంతాల్లో ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి నమ్మ యాత్రిని అనే సంస్థ భాగస్వామ్యంతో ఆటో నడుపుతున్న కోరమంగళకు చెందిన (35) ఏళ్ల స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కలిశాడు.. ఆ వ్యక్తి ఆటోరిక్షాలో మైక్రోసాఫ్ట్ హూడీ ధరించాడు.. తన వివరాలు ఆరా తీయగా ఎందుకు ఆటో నడపాల్సి వస్తుందో వివరించాడు.. పని అనంతరం వారాంతాల్లో ఒంటరితనంతో బాధపడుతున్నానని తెలిపాడు. ఆ ఒంటరి తనాన్ని పోగొట్టుకోవాలో తెలీక ఈ మార్గాన్ని ఎంచుకున్నాని తెలిపాడు.. దీంతో అవాక్కయ్యాను' అంటూ రాసుకొచ్చాడు.

Post a Comment

0 Comments