ఈ వారం పసిడి ధరల్లో వరుస క్షీణత కొనుగోలుదారులకు ఊరటను కలిగిస్తున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ధరల్లో పతనం కొనసాగుతున్నది. నేడు 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2500 పతనాన్ని నమోదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తగ్గిన పసిడి ధరలను పరిశీలిస్తే గ్రాముకు చెన్నైలో రూ.6660, ముంబైలో రూ.6600, దిల్లీలో రూ.6615, కలకత్తాలో రూ.6600, బెంగళూరులో రూ.6600, వడోదరలో రూ.6605, జైపూరులో రూ.6615, మంగళూరులో రూ.6600, నాశిక్ లో రూ.6603, అయోధ్యలో రూ.6615, గురుగ్రాములో రూ.6615, నోయిడాలో రూ.6615 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.2300 తగ్గింపును నేడు నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన గోల్డ్ తాజా ధరలను పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.7266, ముంబైలో రూ.7200, దిల్లీలో రూ.7215, కలకత్తాలో రూ.7200, బెంగళూరులో రూ.7200, వడోదరలో రూ.7205, జైపూరులో రూ.7215, మంగళూరులో రూ.7200, నాశిక్ లో రూ.7203, అయోధ్యలో రూ.7215, గురుగ్రాములో రూ.7215, నోయిడాలో రూ.7215గా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,200 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 తగ్గి రూ.94,500 వద్ద కొనసాగుతోంది.
ホーム
/
తగ్గిన పసిడి ధరలు
/
తగ్గిన పసిడి ధరలు !
الأربعاء، 26 يونيو 2024
100 గ్రాములకు రూ.2500 పతనాన్ని నమోదు చేసింది Andhra Pradesh bulion market business national telangana తగ్గిన పసిడి ధరలు
ليست هناك تعليقات:
إرسال تعليق