నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవులను తాకాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోనూ సమయానుకూలంగా పురోగమించాయని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 19న భారత భూభాగాన్ని తాకాయి. రుతుపవనాల పురోగతి, ప్రారంభాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఐఎండీ కొన్ని ప్రమాణాలను అనుసరిస్తుంది. దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో (3 కిలోమీటర్ల వరకు) కొలిచే పశ్చిమ గాలుల బలం దాదాపు 20 నాట్స్కి పెరిగింది. ఈ ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు నైరుతి గాలులు వీచాయి. మేఘాలు సైతం పెరిగాయి. ఈ ప్రాంతంలో అవుట్గోయింగ్ లాంగ్వేవ్ రేడియేషన్ చదరపు మీటరుకు 200 వాట్ల కంటే తక్కువగా ఉన్నది. గత 24 గంటల్లో నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
అండమాన్ నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు !
الأحد، 19 مايو 2024
national weather అండమాన్ నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం మీదుగా హైదరాబాద్ వాతావరణ శాఖ
ليست هناك تعليقات:
إرسال تعليق