ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, రుషికొండ ఐటీ పార్క్ హిల్ నం.2లో ఇన్ఫోసిస్ ఈనెల 28 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. తొలివిడతలో 650 మంది ఇక్కడ నుంచి పనిచేస్తారు. త్వరలోనే 1000 మందితో సెంటర్ నడిపేందుకు సిద్ధమవుతోంది. ఇన్ఫోసిస్ సంస్థ విశాఖలో శాటిలైట్ ఆఫీసు ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించినప్పటికీ, దాన్ని ఐటీ డెవలప్ మెంట్ సెంటర్ గా అభివృద్ధి చేసింది. కంపెనీ 2022 అక్టోబర్లో కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆఫీస్ ఏర్పాటు విషయంలో ఆలస్యమైంది. తమ క్యాంపస్కు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో పనిచేస్తున్న అభ్యర్థుల్ని ఇప్పటికే ఇన్ఫోసిస్ ఆహ్వానించినట్లు సంస్థ అధికారులు ఇటీవల జరిగిన సీఐఐ సదస్సులో చెప్పారు. విశాఖ కార్యాలయంలో పనిచేయడానికి కొత్తగా ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. ఈ రీజియన్లో ఇన్ఫోసిస్ కోసం పనిచేస్తున్న వారినే ఈ కార్యాలయం నుంచి పనిచేసేలా ఏర్పాట్లు చేసుకుంది. https://t.me/offerbazaramzon
విశాఖలో 28 నుంచి ఇన్ఫోసిస్ కార్యకలాపాలు
الأحد، 25 يونيو 2023
Andhra Pradesh technology ఐటీ డెవలప్ మెంట్ సెంటర్ గా అభివృద్ధి తొలివిడతలో 650 మంది ఇక్కడ నుంచి పనిచేస్తారు విశాఖలో 28 నుంచి ఇన్ఫోసిస్ కార్యకలాపాలు
ليست هناك تعليقات:
إرسال تعليق