ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై మాజీ మంత్రి తన వాదనలను వినిపించనున్నారు. అలాగే కేసులో కేటీఆర్తో పాటు, ఏ2 ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3 హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కూడా కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్ రాక సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసు : నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్
Friday, September 18, 2026
Formula-E Car Racing Case HMDA Chief Engineer BLN Reddy (A3) IAS officer Arvind Kumar (A2) KTR Appears Before Nampally ACB Court telangana
No comments:
Post a Comment