పాకిస్థాన్, పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోని నరోవల్ జిల్లా సిరాజ్ గ్రామంలో మదర్సాను విస్తరించేందుకు వందేళ్ల నాటి ఆలయాన్ని ధ్వంసం చేయడంపై భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అన్యాయమైన చర్యను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టిగా ఖండిస్తూ సదరు ఘటనపై తక్షణమే పారదర్శక విచారణ జరిపించి దోషులను శిక్షించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ ఘోర ఉదంతంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్లో వందేళ్ల క్రితం నాటి ఆలయంపై జరిగిన ఈ విధ్వంసకాండ అక్కడ నివసిస్తున్న మైనారిటీల దయనీయ స్థితిని సజీవంగా చూపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మైనారిటీల మత స్వేచ్ఛ, ప్రార్థనా మందిరాల భద్రత విషయంలో జరుగుతున్న వరుస ఉల్లంఘనలకు ఈ ఘటన నిదర్శనమని పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, ధ్వంసమైన ఆలయాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే మైనారిటీల భద్రతకు, వారి సాంస్కృతిక వారసత్వానికి స్పష్టమైన భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. నరోవల్లోని సిరాజ్ గ్రామంలో ఉన్న ఈ చారిత్రక ఆలయ స్థలాన్ని ఆనుకుని ఉన్న మదర్సా విస్తరణ కోసం మత ఛాందసవాదులేఈ కూల్చివేతకు ఒడిగట్టారని స్థానిక ప్రజలు, మైనారిటీ హక్కుల సంస్థలు, ప్రతిపక్ష రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. చారిత్రక కట్టడాన్ని కావాలనే నేలమట్టం చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తీవ్రమైన ఆరోపణలను కప్పిపుచ్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం విచిత్రమైన సాకులు వెతుకుతోంది. భారీ వర్షాలు కురవడం వల్లే ఈ పాత ఆలయం దెబ్బతిని కూలిపోయిందని స్థానిక అధికార యంత్రాంగం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. పాకిస్థాన్లో మైనారిటీ వర్గాలకు చెందిన దేవాలయాలు, ఆస్తులపై దాడులు జరగడం కొత్తేమీ కాదని, ఈ ఘటన మరోసారి అంతర్జాతీయంగా ఆ దేశాన్ని నిలదీస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పాకిస్థాన్లో వందేళ్ల నాటి ఆలయం ధ్వంసం : తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
الخميس، 3 سبتمبر 2026
Century-old temple demolished in Pakistan India expresses deep shock and outrage issued a statement national Randhir Jaiswal the official spokesperson for the Ministry of External Affairs
ليست هناك تعليقات:
إرسال تعليق