తీసుకున్న అప్పు ఇవ్వలేదని గర్భవతిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆపేసిన కర్కోటకుడు : బిడ్డతో పాటు తల్లి దుర్మరణం

మిళనాడు రాష్ట్రం కాంచీపురంలో తీసుకున్న అప్పు ఇవ్వలేదని గర్భవతిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఆపడంతో ఆమెతో పండంటి బిడ్డ కూడా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగడివాక్కం గ్రామంలో ఆనందన్, తేనేముళి దంపతులు నివసిస్తున్నారు. ఆరుముగం అనే వ్యక్తి వద్ద చెట్లు నరికే పనులు చేయడంతో వారికి ఇరువై వేలు అప్పుగా ఇచ్చాడు. తేనేముళి గర్భవతి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లుతుండగా వారిని ఆరుముగం అడ్డుకొని డబ్బులు కట్టాలని నిలదీశాడు. దీంతో నొప్పులు రావడంతో అక్కడే ప్రసవించి మృతి చెందింది. దీంతో బిడ్డ కూడా చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments