పాకిస్తాన్లోని ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ కోహాట్లోని ఓల్డ్ పోలీస్ లైన్స్ సమీపంలో ఉన్న మసీదు వద్ద పేలుడు పదార్థాలు నింపిన ఒక వాహనం ప్రధాన గేటును వేగంగా ఢీకొట్టడంతో పేలుడు సంభవించి రక్తపాతం చోటుచేసుకుంది. పేలుడు దాటికి మసీదు వెలుపలి గోడలు కూలిపోయి, భయంకరమైన గొయ్యి ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు పోలీసు సిబ్బంది సహా 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీప ప్రాంతాలు కంపించిపోగా, అనంతరం కాల్పుల శబ్దాలు కూడా వినిపించినట్లు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, సహాయక బృందాలు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను వెంటనే కోహాట్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా స్థానిక అధికారులు ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించి, చుట్టుపక్కల ప్రాంతాలను భద్రతా బలగాల నీడలోకి తీసుకువచ్చారు.
ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఆత్మాహుతి దాడి : 15 మంది దుర్మరణం
Friday, September 18, 2026
15 killed explosives-laden vehicle rammed into the main gate of a mosque at high speed international pakistan Suicide Attack in Pakhtunkhwa Province
No comments:
Post a Comment