పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా వెల్లడించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి. వరాలేలతో కూడిన ధర్మాసనం అడ్వకేట్ నరేంద్ర గోస్వామి దాఖలు చేసిన ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. పిటిషనర్ అవసరమైతే సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. పెట్రోల్ బంకుల బోర్డులపై వినియోగదారులకు ఇచ్చే రసీదులు/ఇన్వాయిస్లపై ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. అలాగే E-20 పెట్రోల్ వాడకం వల్ల పాత, కొత్త వాహనాల పనితీరు, మైలేజీ, ఇంజన్ మన్నిక, నిర్వహణ ఖర్చులు, ఇన్సూరెన్స్ అంశాలపై అధ్యయనం చేయడానికి ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఎథనాల్ తయారీకి నీటి వినియోగం, ఆహార భద్రతపై దాని ప్రభావం మరియు ఉద్గారాలపై సమగ్ర నివేదిక అందించాలని కోరారు.
పెట్రోల్లో ఇథనాల్ శాతం కచ్చితంగా వెల్లడించాలంటూ దాఖలైన పిల్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
الاثنين، 31 أغسطس 2026
filed by advocate Narendra Goswami Justice M.M. Sundresh Justice P.B. Varale rejected Supreme Court Dismisses PIL Seeking Mandatory Disclosure of Ethanol Percentage in Petrol
ليست هناك تعليقات:
إرسال تعليق