నాన్‌స్టాప్ బస్సుల్లో సెల్ఫ్ టికెటింగ్ : ఫైలట్ ప్రాజెక్టుగా నల్గొండ-హైదరాబాద్ బస్సులు

السبت، 29 أغسطس 2026

modern technology and rapidly advancing towards digital services Nalgonda-Hyderabad Route Chosen for Pilot Project Self-Ticketing on Telangana RTC Non-Stop Buses

t f B! P L

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనాన్‌స్టాప్ బస్సు సర్వీసుల్లో ఇకపై 'సెల్ఫ్ టికెటింగ్' సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ డిజిటల్ సేవల వైపు వేగంగా అడుగులు వేస్తున్న సంస్థ ఈ కొత్త విధానంతో ప్రయాణికులకు మరింత చేరువ కానుంది. సాధారణంగా బస్సు ఎక్కిన తర్వాత టికెట్ కోసం కండక్టర్ రాక కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. ఒక్కోసారి బస్సులో విపరీతమైన రద్దీ ఉన్న సమయంలో కండక్టర్‌ అందరికీ టికెట్లు జారీ చేయడానికి చాలా సమయం పడుతుంది. ప్రయాణికుల రద్దీ వల్ల కండక్టర్ అటూ ఇటూ కదలడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు ప్రయాణ సమయంలో చిల్లర సమస్యలు తరచుగా ఎదురవుతుంటాయి. ఉదాహరణకు టికెట్ ధర రూ. 120 ఉంటే, ప్రయాణికులు రూ. 500 నోటు ఇస్తే కండక్టర్‌కు చిల్లర తిరిగి ఇవ్వడం కష్టమవుతుంది. వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేలా టీజీఎస్ఆర్టీసీ ఈ సెల్ఫ్ టికెటింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానం ద్వారా బస్సు ఎక్కే ముందు టికెట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేకుండా, ప్రయాణికులే స్వయంగా తమ టికెట్‌ను డిజిటల్ రూపంలో తీసుకునే అవకాశం కలగనుంది. తద్వారా కండక్టర్‌తో అవసరం లేకుండానే ప్రయాణం సాఫీగా ఆటంకాలు లేకుండా సాగుతుంది. ఈ సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని వినియోగించుకోవడం చాలా సులభం. ఈ డిజిటల్ సదుపాయాన్ని ఉపయోగించాలనుకునే ప్రయాణికులు ముందుగా తాము ఎక్కే బస్సు డోర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయాలి. స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికీ క్యూఆర్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. కోడ్ స్కాన్ చేసిన వెంటనే మొబైల్ స్క్రీన్‌పై ఆర్టీసీ అధికారిక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత తాము ప్రయాణం ప్రారంభించే బోర్డింగ్ పాయింట్, అలాగే దిగాల్సిన గమ్యస్థానపు స్టాప్ వివరాలను అందులో స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. వివరాలు ఎంటర్ చేయగానే ప్రయాణానికి అయ్యే చార్జీ స్క్రీన్ మీద చూపిస్తుంది. ఆ మొతాన్ని యూపీఐ ఆధారిత ఆన్‌లైన్ పేమెంట్ విధానాల ద్వారా క్షణాల్లో చెల్లింపు పూర్తి చేయాలి. ఆన్‌లైన్‌లో చెల్లింపు విజయవంతంగా పూర్తి చేసిన వెంటనే ప్రయాణికుడి మొబైల్‌లో ఒక డిజిటల్ టికెట్ అప్పటికప్పుడే జనరేట్ అవుతుంది. ఆ డిజిటల్ టికెట్‌ను నేరుగా బస్సు డ్రైవర్‌కు చూపించి ప్రయాణికులు సీట్లో కూర్చుని సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా ప్రయాణికులే టికెట్ పొందే ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా టికెట్ జారీలో నిత్యం ఎదురయ్యే కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి.ఈ స్మార్ట్ టికెటింగ్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్వీసుల్లో ఒకేసారి కాకుండా ముందుగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ప్రయోగాత్మకంగా మొదట నల్గొండ-హైదరాబాద్ మార్గంలో నిత్యం నడిచే నాన్‌స్టాప్ బస్సుల్లో ఈ సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం నల్గొండ నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ 45 డీలక్స్ నాన్‌స్టాప్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆయా బస్సుల్లోనే ముందుగా ఈ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఈ రూట్‌లో వచ్చే స్పందన, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో దశలవారీగా ఇతర అన్ని రూట్లలోని నాన్‌స్టాప్ సర్వీసుల్లో ఈ విధానాన్ని పక్కాగా విస్తరించాలని సంస్థ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. డిజిటల్ టెక్నాలజీతో ఆర్టీసీ తీసుకుంటున్న ఈ సరికొత్త నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ