లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సెటైర్లు వేశారు.  టీ షర్టులు వేసుకున్నంత మాత్రాన రాహుల్‌ గాంధీ జెన్‌ జీ కాలేరంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని భూ భారతి నవ్వులుపాలైందని మండిపడ్డారు. పర్మిషన్‌ తీసుకుని ట్యాక్స్‌ కడుతున్న ఆస్తులను 22-ఏలో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆర్‌ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ దందా నడుస్తుందన్నారు. భూభారతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పేద ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలనుకుంటే ప్రత్యేకంగా వేరే పథకం కింద ఇవ్వాలని, అంతే కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం ఇవ్వడానికి రాష్ట్రానికి ఇష్టం లేకపోతే, ప్రత్యేకంగా తామే ఇస్తామన్నారు.

Post a Comment

أحدث أقدم