ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు అరండల్ పేట పోలీసులు పలు బి.ఎన్.ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను కించపరిచే విధంగా ఏఐ వీడియోను రాంబాబు విడుదల చేశారని దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లిడ్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇటీవల మంగళగిరి సిఐడి పోలీసులు కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
0 Comments