తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో ఇంటి పక్కన ఉన్న యాప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గొడ్డలితో దాడి చేయడంతో మంద వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మరో వ్యక్తి సైదా కూడా తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఎర్రగడ్డ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ : ఇద్దరు మృతి
السبت، 29 أغسطس 2026
Clash Between Two Groups Over Neem Tree crime Erragadda Thanda Mellachervu Mandal Suryapet district telangana Two dead
ليست هناك تعليقات:
إرسال تعليق