Ad Code

కామన్‌వెల్త్ గేమ్స్ విజేతలపై మోడీ ప్రశంసలు : అథ్లెట్లతో మోడీ నివాసంలో ఆత్మీయ సమావేశం

కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోడీ  నివాసంలో ఆత్మీయ సమావేశం జరిగింది. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినందుకు వారి పట్టుదల, శ్రమ మరియు కృషిని ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తన నివాసానికి తరచుగా వచ్చే అతిథుల్లో క్రీడాకారులే ముందుంటారని పేర్కొన్నారు. నేను ఈ ఇంట్లో దాదాపు 12 నుండి 13 సంవత్సరాలుగా ఉంటున్నాను. నేను క్రమం తప్పకుండా ప్రతిసారీ సాదరంగా ఆహ్వానించేది ఎవరినైనా ఉందంటే అది అథ్లెట్లనే. గత 10 నుండి 12 సంవత్సరాలుగా మీ కష్టపడే తత్వం భారతదేశానికి విజయాన్ని అందించాలనే మీ నిరంతర ప్రయత్నాలు మరియు విజయాల కొత్త శిఖరాలను అధిరోహించే సాంప్రదాయమే దీనికి కారణం అని మోడీ తెలిపారు. యువత క్రీడల వైపు అడుగులు వేసేలా ప్రేరేపించడంలో అథ్లెట్ల సాధనలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన నొక్కిచెప్పారు. మేము పాఠశాలలకు వెళ్తూ మీరు క్రీడలు ఆడాలి అని చెప్పే మాటల కంటే మీరు సాధించిన పతకాలే వారిలో అత్యధిక స్ఫూర్తిని నింపుతాయి ని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ పలువురు క్రీడాకారులతో విడివిడిగా మాట్లాడారు. మహిళల షాట్‌పుట్ F57 స్వర్ణ పతక విజేత షర్మిలా ధంకర్‌తో మాట్లాడుతూ గతంలో ఆమె ఇచ్చిన ఒక హామీని గుర్తుచేశారు. గతంలో మీరు మీ ఇద్దరు కుమార్తెలను కూడా అథ్లెట్లుగా తీర్చిదిద్దుతానని నాకొక మాట ఇచ్చారు అని మోడీ అన్నారు. దానికి షర్మిల స్పందిస్తూ అవును సర్, వారు ఇంకా చిన్న పిల్లలే. వచ్చే కామన్‌వెల్త్ గేమ్స్‌ నాటికి మా ఇంటి నుండి మూడు పతకాలు రావడం మీరు చూస్తారు అని ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu