సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా థియేటర్లలో వంద కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 19న రిలీజై హిట్ అయిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 17 నుండి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు కొంతమంది ఎగ్జిబిటర్స్ దీన్ని తక్కువగా అంచనా వేశారు. సమంత మాట్లాడుతూ, "నా ఫ్రెండ్ ఒక ఎగ్జిబిటర్ ని వసూళ్ల గురించి అడిగితే 'హీరోయిన్ సినిమా ఎవరు చూస్తారు?' అంటూ నిర్మొహమాటంగా చెప్పాడు" అని గుర్తు చేసుకుంది. కానీ ఈ సినిమా ఆ అభిప్రాయాలను పూర్తిగా తప్పు అని నిరూపించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు కాజల్ అగర్వాల్, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. సమంత సందేశాన్ని చిత్ర పరిశ్రమ కూడా సపోర్ట్ చేస్తోంది. ఇలాంటి మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు ఇంకా రావాలని ఆశిస్తున్నారు.
0 Comments