మహారాష్ట్రలోని పర్భానీ జిల్లా యశ్వాడి గ్రామంలో శనివారం మధ్యాహ్నం ప్రమాదం సంభవించింది. ఇక్కడి ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో నిర్మాణంలో ఉన్న సభామండపం పైకప్పు భాగం ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. హనుమాన్ దేవాలయాల్లో శనివారం నాడు భక్తుల రద్దీ సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. యశ్వాడి గ్రామంలోని ఈ ఆలయానికి కూడా ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులంతా దర్శనం కోసం వేచి ఉన్న సమయంలో, గత కొన్ని రోజులుగా నిర్మాణంలో ఉన్న సభామండపం పైకప్పు, దానికి ఆసరాగా ఉన్న ఒక పిల్లర్, గోవా కర్రలు ఒక్కసారిగా కుప్పకూలి కింద ఉన్న భక్తులపై పడ్డాయి. ఈ హఠాత్పరిణామంతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం, భయాందోళనలు రేగాయి.
ホーム
/
Yashwadi village
/
కూలిన నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయ మండపం : పలువురు భక్తులకు తీవ్ర గాయాలు
السبت، 20 يونيو 2026
Hanuman Temple Hall Under Construction Collapses maharashtra Parbhani district Several Devotees Critically Injured Yashwadi village
ليست هناك تعليقات:
إرسال تعليق