అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల కానుకలు అదృశ్యమయ్యాయని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.''రామ మందిరానికి సమర్పించిన కోట్ల రూపాయల కానుకలు గల్లంతవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులకు అత్యంత సున్నితమైన వార్త. ఇది ఆలయ ట్రస్టుకు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్ సనాతన సమాజానికి శ్రీరామునిపై ఉన్న ప్రగాఢ విశ్వాసానికి ఇది నేరుగా సంబంధించిన విషయం కాబట్టి, కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించాలని అభ్యర్థిస్తున్నాము. ప్రభుత్వ మౌనం అనుమానాస్పదంగా ఉంది.'' అని ట్వీట్ చేశారు.ఎస్పీ అధినేత చేసిన ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పందించలేదు. ఈ వార్త వైరల్ అయిన తర్వాత ట్రస్ట్ నుంచి ఎలాంటి వివరణ, ఖండన రాలేదు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరికొన్ని నెలల్లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లు రాబోతున్న నేపథ్యంలో అఖిలేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ホーム
/
uttarpradesh
/
రామమందిరంలో కోట్లాది రూపాయల కానుకలు అదృశ్యం : సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్
الأحد، 7 يونيو 2026
national Offerings worth crores at Ram Mandir go missing SP Chief Akhilesh Yadav tweets there has been no explanation or denial from the Trust since the news went viral uttarpradesh
ليست هناك تعليقات:
إرسال تعليق