హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్కు కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దైర్యం లేదన్నారు. ఉనికిని కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ ఉందన్నారు. పదేళ్లలో మీరు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్లు ఎన్ని అని ప్రశ్నించిన ఆయన, డబుల్ బెడ్ రూమ్స్పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాటాల పంపకాల్లో తేడా వల్లే కవిత పార్టీ పెట్టిందన్నారు. కిషన్ రెడ్డికి కేసీఆర్తో లోపాయికారి ఒప్పందం ఉందని, అందుకే కాళేశ్వరంపై విచారణ చేయడం లేదన్నారు. ఫోన్ టాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. కూతురు పెట్టిన కుంపటితో కేసీఆర్ బయటకు వచ్చారన్నారు. ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు పాత్ర ఉంది, దాన్ని ఆయన నిరూపించుకోవాలన్నారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరేనన్నారు. విద్య, వైద్యం పథకం పరంగా ఇస్తున్న నిధులు బేరీజు వేసుకోవాలన్నారు. ప్రజా పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. బీఆర్ఎస్ ఏ సభ పెట్టినా ప్రయోజనం లేదన్నారు.
ఉనికిని కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ ఉంది !
الجمعة، 1 مايو 2026
BRS is Preoccupied with Preserving its Existence he demanded the release of a white paper regarding the double-bedroom housing scheme telangana TPCC President & MLC Mahesh Kumar Goud
ليست هناك تعليقات:
إرسال تعليق