Ad Code

సిమెంట్‌ మిక్సర్‌ వెహికల్‌ను ఢీకొన్న ఈకో వ్యాన్‌ : 11 మంది దుర్మరణం

హారాష్ట్రలోని థానే జిల్లాలో కళ్యాణ్‌- అహల్యానగర్‌ హైవేపై ఎదురుగా వస్తున్న ఒక సిమెంట్‌ మిక్సర్‌ వాహనాన్ని ప్రయాణికులతో వెళ్తున్న ఈకో వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈకో వాహనం ముర్బాద్‌వాసులను కళ్యాణ్‌కు తీసుకువెళుతోంది. గోవిలి గ్రామ సమీపంలోని రైతా బ్రిడ్జి దాటుతుండగా ఆ వాహనం ఎదురుగా వస్తున్న సిమెంట్‌ మిక్సర్‌ను ఈకో వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 11 మంది మృతి చెందారు. ఒక వృద్ధ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే తిట్వాలా పోలీసులు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వాహనాల్ని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu