తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఐపీటీఎంఎంకే) పట్టాలి మక్కల్ కచ్చి (పిఎంకె)తో పొత్తు పెట్టుకోనుంది. దీనికోసం ఆమె శనివారం విల్లుపురం జిల్లా తైలపురంలోని పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడై రామదాస్ని కలిశారు. ఎన్నికల పొత్తు గురించి, కూటమి ఏర్పాటు గురించి సుమారు రెండు గంటలపాటు ఆమె ఆయనతో చర్చించారు. ఎన్నికల పొత్తుకు తాము సిద్ధమని రామదాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఈ పొత్తు ఇప్పటికే తమిళనాడులో బలమైన ప్రభావాన్ని చూపింది. పలువురు ప్రత్యర్థులను కలవరపరిచింది. మరిన్ని పార్టీలు మాతో చేరుతాయని భావిస్తున్నాం' అని అన్నారు. మొత్తం 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని తమ కూటమి యోచిస్తున్నదని ఆయన వెల్లడించారు.
తమిళనాడులో పీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏఐపీటీఎంఎంకే
السبت، 21 مارس 2026
AIPTMKM Forms Alliance with PMK in Tamil Nadu plans to field candidates in all 234 assembly constituencies Ramadoss Ramadoss at his residence in Thailapuram Sasikala Villupuram distric
ليست هناك تعليقات:
إرسال تعليق