ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ భవనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇప్పటివరకు 787 మంది మృత్యువాతపడినట్టు సమాచారం. సుమారు 100 ఫైటల్ జైట్లను ఉపయోగించి 250కి పైగా బాంబులను జారవిడిచనట్టు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్ రాజకీయ, సైనిక నిర్ణయాలు తీసుకునే కీలక కేంద్రంగా ఈ సముదాయం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలు, ఇజ్రాయెల్పై వ్యూహాలను ఇక్కడ రచిస్తారని, అందుక ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక్కడ నుంచే ఇరాన్ సైనిక, భద్రతా వ్యవహరాలన్నీ నడుస్తాయని, ఇది ఉగ్రవాద పాలనకు ప్రధాన కార్యాలయంగా మారిందని ఐడీఎఫ్ పేర్కొంది.
0 Comments