హైదరాబాద్ నగరంలో 2050 సంవత్సరం నాటికి మెట్రో నెట్వర్క్ ను 556.6 కిలోమీటర్లకు విస్తరించనున్నారు. ప్రస్తుతం 70 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించి ఉండగా, రెండో దశలో 150 కిలోమీటర్లు విస్తరణకు అనుమతులు రాగా, మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం నెట్వర్క్ ను 336.4 కిలోమీటర్లకు, రోడ్ల నెట్వర్క్ ను 19,352 కిలోమీటర్లకు పెంచనున్నారు. ఇదే సమయంలో కొత్తగా 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్ లను నిర్మాణం చేయడానికి కూడా హెచ్ఎండిఏ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరం మధ్య నుంచి వెళుతున్న మూసీ నదిపై 29 బ్రిడ్జ్ లను నిర్మించనున్నారు. మొత్తం 34 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, 16 రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఎనిమిది ఎలివేటెడ్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. 2050 సంవత్సరం నాటికి ప్రత్యేక బస్సు లైన్ ల కోసం 48 కిలోమీటర్ల ప్రత్యేక బస్సుల కారిడార్లను, ఏడు అంతర్రాష్ట్ర బస్సు, ట్రక్ టెర్మినల్స్ ను ఏర్పాటు చేస్తారు. ఈ సమగ్ర రవాణా ప్రణాళికకు నాలుగు లక్షల కోట్ల అవసరం అవుతాయని హెచ్ఎండిఏ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి ఈ ప్రణాళికను అమలు చేయడం తప్పనిసరని హెచ్ఎండిఏ భావిస్తోంది.
2050 నాటికి 556.6 కిలోమీటర్లకు విస్తరించనున్న హైదరాబాద్ మెట్రో !
الجمعة، 13 مارس 2026
Hyderabad Metro to Expand to 556.6 Kilometers by 2050 officials have prepared proposals for the construction of 120 new Foot Over Bridges Skywalks telangana
ليست هناك تعليقات:
إرسال تعليق