దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8 కోట్ల మంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేలా సరికొత్త మొబైల్ అప్లికేషన్ను తీసుకురానుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా, సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలోని అర్హతగల మొత్తాన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా తక్షణమే విత్డ్రా చేసుకునే సౌకర్యం కలగనుంది.ఈపీఎఫ్ఓ 3.0 అప్గ్రేడ్లో భాగంగా ఈ కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం పీఎఫ్ డబ్బుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే, ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజులు పడుతోంది. కాగా కొత్త ఆటో-సెటిల్మెంట్ విధానంలో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా మూడు రోజుల్లోనే క్లెయిమ్లు పరిష్కారమై, డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఆటో-సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఏటా 5 కోట్లకు పైగా క్లెయిమ్లను పరిష్కరించే ఈపీఎఫ్ఓపై భారాన్ని తగ్గించి, బ్యాంకుల తరహాలో వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ఈ కొత్త యూపీఐ విత్డ్రా వ్యవస్థలో పలు కీలక ఫీచర్లు ఉండనున్నాయి. సభ్యులు తమ యూపీఐ పిన్ ఉపయోగించి, అర్హత ఉన్న నిధులను దాదాపు తక్షణమే తమ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. వివాహం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి అత్యవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాథమికంగా ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.25,000 వరకు విత్డ్రా చేసుకునే పరిమితిని ప్రతిపాదించారు. యాప్లో విత్డ్రాకు అందుబాటులో ఉన్న అర్హతగల బ్యాలెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, పదవీ విరమణ భద్రత కోసం మొత్తం బ్యాలెన్స్లో కనీసం 25 శాతం లాక్ చేసి ఉంచుతారు.ప్రస్తుతం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 100 డమ్మీ ఖాతాలతో ఈ యాప్పై ట్రయల్ రన్స్ నిర్వహిస్తోంది. ఏవైనా సాంకేతిక సమస్యలుంటే గుర్తించి, పరిష్కరించిన తర్వాతే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త యాప్ యూపీఐ విత్డ్రాయల్స్కు ప్రధాన వేదికగా మారినప్పటికీ, ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ మెంబర్ పోర్టల్, ఉమాంగ్ యాప్ వంటి పాత ప్లాట్ఫామ్లు ఇతర సేవల కోసం యథావిధిగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు.
కొత్త మొబైల్ అప్లికేషన్ను తీసుకురానున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ
الاثنين، 9 فبراير 2026
introduced as part of the EPFO 3.0 upgrade set to launch a new mobile application technology The Employees' Provident Fund Organisation
ليست هناك تعليقات:
إرسال تعليق