రూ.5 నోటు చాలా అరుదైనదని, అది తమకు ఉంటే రూ.10 లక్షలు ఇస్తామని అంటూ ఫోన్ కాల్స్ చేసి బాధితులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నోటును కొనుగోలు చేసే ప్రక్రియ కోసం ముందుగా కొంత మొత్తం పంపాలని మోసగాళ్లు సూచిస్తున్నారు. ఈ మాటలు నమ్మి డబ్బు పంపగానే, వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో ఉండకుండా మారిపోతున్నారు. ఇలాంటి మోసాలతో పాటు, తెలియని నంబర్ల నుంచి APK ఫైళ్లను డౌన్లోడ్ చేసుకోవాలని మెసేజులు కూడా వస్తున్నాయని పోలీసులు తెలిపారు. అటువంటి ఫైళ్లను ఓపెన్ చేస్తే, మొబైల్ డేటా, బ్యాంక్ వివరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తులు లేదా అనుమానాస్పద ఆఫర్లకు స్పందించవద్దని, ముందుగా డబ్బులు అడిగే లావాదేవీలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా సందేహాస్పద కాల్స్ లేదా మెసేజులు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
ホーム
/
technology
/
కొత్త తరహా సైబర్ మోసం : రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు !
الأحد، 1 فبراير 2026
cyber Criem Get Rs. 10 lakhs for a Rs. 5 note national New type of cyber fraud police have reported that messages are also being sent from unknown numbers technology
ليست هناك تعليقات:
إرسال تعليق