సోషల్ మీడియా వీడియో వ్యూస్ కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపై కొందరు యువకులు తుంటరులు పెద్ద పెద్ద చెక్క దుంగలు పెట్టి ఆపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిలో హైస్పీడ్ రైల్వే ట్రాక్ మీద దుంగలు పెట్టిన దృశ్యాలు కనిపించాయి. వీడియో తీస్తూ "వందే భారత్ రుక్వా దియే" అంటూ అరుస్తూ నవ్వుకున్నారు. తర్వాతి సీన్లో దూర ప్రాంతంలో రైలు ఆగి ఉన్నట్టు చూపించారు. రైల్లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. వీళ్లు రైలు ఎక్కబోతున్నారని అతనికి అనుమానం వచ్చింది. అప్పుడు ఆ యువకులు "మేం రైలులోకి రావడం లేదు, వీడియో షూట్ చేస్తున్నాం" అంటూ చెప్పారు. ఈ వీడియో ఎక్స్ ప్లాట్ఫామ్లో షేర్ అయ్యింది. చాలా మంది యూజర్లు అధికారులను ట్యాగ్ చేశారు. యూనియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ పేరును కూడా ట్యాగ్ చేశారు. "రీల్స్ కోసం చెక్క దుంగలు పెట్టి వందే భారత్ రైలును ఆపడం ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు. ఇది ఉగ్రవాద చర్యగా పరిగణించాలి. రైల్ మినిస్టర్, రైల్వే పోలీస్ ఫోర్స్ అందరినీ అరెస్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్తో కలిసి ఎన్ఎస్ఏ చట్టం వర్తింపజేయాలి" అని ఒక యూజర్ కోరాడు. "రైళ్లను ధ్వంసం చేయడం లేదా అడ్డుకోవడం లాంటి పనులకు జీవిత ఖైదు లాంటి కఠిన శిక్షలు ఉంటే ఇలాంటి యువకులు మారవచ్చు" అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇంకొకరు "ఇది ఉగ్రవాద చర్య కాకపోతే మరేదీ ఉగ్రవాదం అవుతుంది, అశ్విని వైష్ణవ్?" అంటూ ప్రశ్నించారు. ఇంకొంతమంది వీరి చర్యలను "చాలా దారుణం" అంటూ విమర్శించారు. రైల్వేస్ యాక్ట్ 1989లోని సెక్షన్ 150 ప్రకారం రైలు ప్రయాణంలో చెడు ఉద్దేశంతో రైలును ఆపితే చేస్తే తీవ్ర శిక్షలు ఉంటాయి. పట్టాలపై దుంగలు, రాళ్లు లేదా ఇతర వస్తువులు పెట్టడం కూడా దీని కిందకి వస్తుంది. ఈ నేరానికి జీవిత ఖైదు లేదా పది సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడవచ్చు. మొదటిసారి నేరం చేసినా కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్ష తప్పదు. మళ్లీ మళ్లీ ఇదే పని చేస్తే ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 174 ప్రకారం రైలు ఆపరేషన్ను అడ్డుకుంటే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ పడవచ్చు. రైల్వే ట్రాక్లపై అక్రమంగా ప్రవేశించడం సెక్షన్ 147 కింద నేరం. దీనికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల వరకు ఫైన్ లేదా రెండూ విధిస్తారు. రైల్వే సిబ్బంది తమ విధులు నిర్వహించకుండా అడ్డుకుంటే సెక్షన్ 146 కింద కూడా ఇదే రకమైన శిక్షలు ఉంటాయి. ఇండియన్ రైల్వేస్ ప్రమాదకర ప్రవర్తనపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. కారణం లేకుండా ఎమర్జెన్సీ చైన్ లాగడం, ప్లాట్ఫామ్లపై పొగ తాగడం, ట్రాక్లను అక్రమంగా దాటడం లాంటి పనులకు ఫైన్తో పాటు చట్టపరమైన చర్యలు తప్పవు. చిన్న వీడియో కోసం చేసిన నిర్లక్ష్యపు పని ఎంత పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలదో ఈ ఘటన చెబుతోంది. సరదాగా మొదలైన పని వందల మంది ప్రాణాలకు ముప్పుగా మారవచ్చని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
"వందే భారత్ రుక్వా దియే" అంటూ అరుస్తూ నవ్వుకున్న తుంటరులు : సోషల్ మీడియా వీడియో వైరల్
السبت، 24 يناير 2026
" shouted the miscreants while laughing "We stopped the Vande Bharat national next scene shows the train stopped in the distance Social media video goes viral
ليست هناك تعليقات:
إرسال تعليق