హౌరా - గౌహతి మధ్య నూతనంగా ప్రారంభమైన వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్లో మాంసాహార భోజనాన్ని అందించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. గతంలో ఈ రైలులో కేవలం శాకాహార భోజనం మాత్రమే అందుబాటులో ఉండటంతో, ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అలాగే ఈ రైలులో ఆహార ఎంపికలపై రాజకీయంగానూ చర్చలు జరిగాయి. ఈ వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీడీ ప్రారంభించారు. ఈ రైలు జనవరి 22న కామాఖ్య నుండి, మర్నాడు హౌరా నుండి తన రాకపోకల కార్యకలాపాలను ప్రారంభించింది. కాగా పశ్చిమ బెంగాల్- అస్సాం రాష్ట్రాలను అనుసంధానించే ఈ సుదీర్ఘ రాత్రి ప్రయాణ రైలులో కేవలం శాకాహారం మాత్రమే అందించడం సరికాదని ప్రయాణికులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రైలులో ప్రయాణించేవారు తమ రోజువారీ ఆహారంలో మాంసం, చేపలకు ప్రాధాన్యత ఇస్తారని ప్రయాణికులు తెలిపారు.
ホーム
/
Previously
/
వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్లో మాంసాహార భోజనం
الخميس، 29 يناير 2026
between Howrah - Guwahati national Non-vegetarian meals on Vande Bharat Sleeper Express only vegetarian meals were available on this train Previously
ليست هناك تعليقات:
إرسال تعليق