ఎయిర్ ఇండియా మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి రూ.15 వేల కోట్ల (సుమారు $1.6 బిలియన్లు) భారీ నష్టాన్ని నివేదించనుంది. జూన్కు ముందు ఎయిర్ ఇండియా తన గత ఇబ్బందులను పక్కనపెట్టి తిరిగి గాడిలో పడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి కార్యాచరణ లాభాలు సాధించాలని కంపెనీ వ్యవస్థాపకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ జూన్ లో జరిగిన డ్రీమ్లైనర్ ప్రమాదం అన్నింటినీ తారుమారు చేసింది. ఆ ఘోర ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. నిజానికి ఇది ఎయిర్లైన్ వృద్ధికి ఎండ్ కార్డ్ పలికింది. సమస్య అక్కడితో సమసిపోలేదు. భారతదేశంతో సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ తన వైమానిక ప్రాంతాన్ని భారత విమానాలకు మూసివేయడానికి దారితీసింది. ఇది ఎయిర్ ఇండియా ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. యూరప్ – అమెరికాకు విమానాలు ఇప్పుడు ఎక్కువ దూరంలో ప్రయాణించాల్సి వస్తుంది. దీని ఫలితంగా ఇంధనం, నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ రెండు సంఘటనలు ఎయిర్ ఇండియా లాభాలపై ఉన్న ఆశలను దెబ్బతీశాయి. నష్టాలు పెరగడం వల్ల ఎయిర్లైన్ యజమానులు టాటా గ్రూప్ – సింగపూర్ ఎయిర్లైన్స్ రెండూ కూడా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఎయిర్లైన్ ప్రస్తుత యాజమాన్యం.. పలు వర్గాలు సమాచారం ప్రకారం బోర్డుకు కొత్త ఐదేళ్ల ప్రణాళికను సమర్పించిందని, మూడవ సంవత్సరం నుంచి లాభాలను సాధిస్తామని హామీ ఇచ్చిందని సమాచారం. అయితే బోర్డు ఈ ప్రణాళికను పూర్తిగా తిరస్కరించింది. ఎయిర్లైన్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి మరింత దూకుడుగా, వేగవంతమైన సంస్కరణలు అవసరమని బోర్డు విశ్వసిస్తోంది. ఈ గందరగోళం మధ్య, నాయకత్వ మార్పు పుకార్లు కూడా తీవ్రమయ్యాయి. ప్రస్తుత సీఈఓ కాంప్బెల్ విల్సన్ స్థానంలో కొత్త వ్యక్తి కోసం టాటా గ్రూప్ వెతుకుతోంది. అయితే విమాన ప్రమాదంపై తుది దర్యాప్తు నివేదిక విడుదలయ్యే వరకు ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగవచ్చని సమాచారం. ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దుర్బలంగా ఉంది. పలు నివేదికల ప్రకారం గత మూడు సంవత్సరాలలో కంపెనీ మొత్తం రూ.32,210 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కేవలం గత ఏడాది మాత్రమే ఈ ఎయిర్లైన్ రూ.10 వేల కోట్ల తాజా ఆర్థిక సహాయం కోరింది. 2024లో విస్తారాతో విలీనం తర్వాత ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను కొనుగోలు చేసిన సింగపూర్ ఎయిర్లైన్స్ ఇప్పుడు ఈ నష్టాల భారాన్ని అనుభవిస్తోంది. ఎయిర్ ఇండియా పేలవమైన పనితీరు సింగపూర్ ఎయిర్లైన్స్ ఆదాయాలపై కూడా ప్రభావం చూపుతోంది.
కష్టాల కడలిలో ఎయిర్ ఇండియా : రూ.15 వేల కోట్ల నష్టం
الخميس، 22 يناير 2026
000 crore loss Air India in trouble are currently facing difficult times due to mounting losses business financial year ending March 31 national Rs 15 Tata Group and Singapore Airlines
ليست هناك تعليقات:
إرسال تعليق