సైబర్ మోసాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇప్పుడు మీ ఫోన్ నుంచి యాక్టివ్ సిమ్ కార్డ్ను తీసివేసిన తర్వాత అన్ని మెసేజింగ్ యాప్లు పనిచేయవు. ప్రభుత్వం కొత్త సైబర్ భద్రతా నియమాలను అమలు చేసింది. వాట్సాప్ ఇకపై సిమ్ లేకుండా పనిచేయదు. దేశంలో వాట్సాప్, టెలిగ్రామ్ ఇతర యాప్లు మెసేజింగ్ మాధ్యమంగా మారాయి. కానీ పెరుగుతున్న సైబర్ మోసం, ఆన్లైన్ నేరాల కేసులను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం మెసేజింగ్ యాప్లకు సంబంధించిన నియమాలను పూర్తిగా మార్చింది. కేంద్ర ప్రభుత్వం కొత్త సైబర్ భద్రతా నిబంధనల ప్రకారం, ఇప్పుడు ఫోన్లో యాక్టివ్ సిమ్ కార్డ్ ఉంటే తప్ప ఏ మెసేజింగ్ యాప్ పనిచేయదు. అంటే, యూజర్ సిమ్ తీసేస్తే యాప్ వెంటనే పనిచేయడం ఆగిపోతుంది. నేరస్థులు తరచుగా అసలు సిమ్ను తీసివేసి, నకిలీ నంబర్లు, వీపీఎన్, నకిలీ ఖాతాలను ఉపయోగించి ఇంటర్నెట్ లేదా వైఫై ద్వారా సైబర్ మోసానికి పాల్పడతున్నారని ప్రభుత్వం తెలిపింది. దీన్ని ఆపడానికి కొత్త నిబంధనను రూపొందించారు. కొత్త మార్గదర్శకాలు వాట్సాప్, టెలిగ్రామ్,స్నాప్ చాట్,జీ చాట్,జోష్ మొబైల్ ఫోన్ నంబర్లను ఉపయోగించే ఏవైనా ఇతర యాప్లతో సహా అన్ని మెసేజింగ్ యాప్లకు వర్తిస్తాయి. టెలికమ్యూనికేషన్స్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు 2025 ప్రకారం టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ మార్పును తప్పనిసరి చేసింది. సిమ్ యాక్టివ్గా ఉండి మొబైల్ లో ఉన్నప్పుడు మాత్రమే యూజర్ ఖాతా యాక్టివ్గా ఉండేలా కంపెనీలు నిర్ధారించుకోవాలి. సిమ్ కార్డ్ లేని నేపథ్యంలో నడుస్తున్న ఏదైనా యాప్ ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అవుతుంది. ఈ నియమం మొబైల్ యాప్కే కాకుండా వాట్సాప్ వెబ్కు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు వాట్సాప్ వెబ్ ప్రతి ఆరు గంటలకు ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అవుతుంది. దీని తర్వాత, వినియోగదారుడు మొబైల్ నుండి QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మళ్లీ లాగిన్ అవ్వాలి. 90 రోజుల్లోపు కొత్త వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం మెసేజింగ్ యాప్ కంపెనీలను ఆదేశించింది. ఇప్పటివరకు, మెసేజింగ్ యాప్ను ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు, ఓటీపీ ద్వారా మొబైల్ నంబర్ ధృవీకరణ ఒక్కసారి మాత్రమే అవసరం అవుతుంది. కానీ, డాట్ ఆదేశాన్ని పాటించడానికి, వారు తమ సిమ్ కార్డుల ఐఎంసీఐని యాక్సెస్ చేయడం ప్రారంభించాలి. ఐఎంసీఐఅంటే ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి మొబైల్ సబ్స్క్రైబర్ను గుర్తించే ఒక ప్రత్యేక సంఖ్య. ఇది సిమ్ కార్డ్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ తర్వాత, మొబైల్ నుంచి సిమ్ కార్డును తీసివేసిన తర్వాత కూడా యాప్ పని చేస్తూనే ఉంది. సైబర్ మోసగాళ్ళు ఈ లొసుగును సద్వినియోగం చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు.
సైబర్ మోసాన్ని అరికట్టేందుకు కీలక అడుగు వేసిన ప్రభుత్వం
الاثنين، 1 ديسمبر 2025
Government takes key step to curb cyber fraud national Now all messaging apps will not work after removing the active SIM card from your phone
ليست هناك تعليقات:
إرسال تعليق