"తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్" కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మహేంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ యువత, మహిళల అభివృద్ధి ఇందులో ఉందని ఈ డ్యాకుమెంట్ రూపొందించినందుకు సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్లో మహిళలు నడుపుతున్న బ్యాటరీ పరిశ్రమ తమకెంతో ప్రత్యేకమని ఆనంద్ మహీంద్రా అన్నారు. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం రంగంలో ఉన్న తనకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సమ ఉజ్జీవులుగా అనిపించారని తెలిపారు. ప్రస్తుతం ఎంత ఏఐ, డిజిటల్ సాంకేతికతలు వచ్చినా హ్యుమన్ టచ్కు ఉన్న ప్రత్యేకత వేరని ఆ స్కిల్ను భర్తీ చేయడం ఎవరి వల్లా కాదని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
ఏఐ, డిజిటల్ సాంకేతికతలు వచ్చినా హ్యుమన్ టచ్కు ఉన్న ప్రత్యేకత వేరు : ఆనంద్ మహీంద్రా
الثلاثاء، 9 ديسمبر 2025
Anand Mahindra Even with the advent of AI and digital technologies science technology Telangana Rising Global Summit the speciality of human touch is different
ليست هناك تعليقات:
إرسال تعليق