మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో వస్తున్న 'SSMB29' చిత్రానికి సంబంధించిన మొదటి ఈవెంట్ "గ్లోబ్ట్రాటర్ ఈవెంట్" నవంబర్ 15న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల చేసి అభిమానులకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ ఈవెంట్కు కేవలం పాస్లు ఉన్న వారినే అనుమతిస్తారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న "ఎవరైనా వెళ్లొచ్చు" అనే వార్తలను నమ్మొద్దని హెచ్చరించారు. అభిమానులందరూ క్రమశిక్షణగా వ్యవహరించాలని, ఈవెంట్ను జియో హాట్స్టార్లో లైవ్గా వీక్షించవచ్చని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నటుడు పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా జోనస్ ల ఫస్ట్ లుక్స్ విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.
0 Comments