ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఐటీ, ఆటో, మెటల్ షేర్లలో అమ్మకాలతో కీలక సూచీలు కుదేలయ్యాయి. రేట్ కట్ పై అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారులు ప్రతికూల సంకేతాలు పంపడం మదుపుదారుల సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది, మొత్తంమీద సెన్సెక్స్ 519 పాయింట్ల నష్టంతో 83,459 పాయింట్ల వద్ద ముగియగా 165 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 25,597 పాయింట్ల వద్ద క్లోజయింది. పవర్ గ్రిడ్, ఎటర్నల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతి సుజుకి షేర్లు రెండు నుంచి మూడు శాతం నష్టపోయాయి.
إرسال تعليق