జపాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం : సునామీ హెచ్చరిక జారీ


త్తర జపాన్ తీరంలో ఆదివారం సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల దిగువన 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ సంస్థ తెలిపింది. ఉత్తర తీర ప్రాంతానికి 1 మీటర్ వరకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్ హెచ్ కే ఆదివారం తెలిపింది. ఇదిలా ఉండగా, జపాన్ ఉత్తరాన ఉన్న ఇవాటే ప్రిఫెక్చర్‌కు సునామీ హెచ్చరిక జారీ చేశారు. నివాసితులు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి 70 కి.మీ (45 మైళ్ళు) దూరంలో సాయంత్రం 5:12 గంటలకు (0812 GMT) సునామీ సంభవించిందని, త్వరలోనే అది పసిఫిక్ తీరానికి చేరుకుంటుందని ఎన్ హెచ్ కే నివేదించింది. దాదాపు 1 మీటర్ (3 అడుగులు, 3 అంగుళాలు) ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతకుముందు, అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్రకారం, జపాన్‌లోని అతిపెద్ద ద్వీపమైన హోన్షు తూర్పు తీరంలో 6.26 తీవ్రతతో భూకంపం సంభవించింది, ఇందులో ఇవాటే కూడా ఉంది. రైల్వే ఆపరేటర్ జేఆర్ ఈస్ట్ ప్రకారం, ఈ ప్రాంతంలో బుల్లెట్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. భూకంపాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని క్యోటో న్యూస్ నివేదించింది. ఈ ప్రాంతం మార్చి 2011లో ఘోరమైన భూకంపం, సునామీతో అతలాకుతలమైంది.

Post a Comment

0 Comments