ఢిల్లీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనపై కొందరు వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారని ఆ సమయంలో తాను ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడంతో చేతులకు తీవ్ర గాయాలయ్యాయని ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పోలీసులు నిజమని నమ్మి కేసు నమోదు చేశారు. అయితే ఇదంతా ఆ యువతి, ఆమె తండ్రి కట్టుకథ అని తెలిసి పోలీసులు బిత్తరపోయారు. ఘటనా స్థలిలో సీసీ కెమెరాలు, నిందితుల ఫోన్లు ట్రాకింగ్ లాంటి అధునాతన సాంకేతికతో కేసును ఛేదించారు. ఓ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ విద్యార్థిని తండ్రి రచించిన పథకంగా పోలీసులు తేల్చారు. పరారీలో ఉన్న విద్యార్థిని తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యాసిడ్ దాడికి పాల్పడినట్లు చెబుతున్న ఆ ముగ్గురు యువకుల్లో ప్రధాన నిందితుడిగా భావించిన జితేందర్ భార్యపై విద్యార్థిని తండ్రి వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఇదే విషయంపై అతడిపై కేసు కూడా నమోదైనట్లు తేలింది.తనపై కేసు పెట్టారన్న కోపంతో తన కూతుర్ని ఈ విధంగా యాసిడ్ దాడి నాటకం ఆడించి.. ఆ ముగ్గురే తనపై దాడి చేశారని చెప్పమన్నాడు. ఆ విద్యార్థిని తండ్రి చెప్పినట్లు యాసిడ్ దాడి ప్లాన్ ను అమలు చేసింది. ఎట్టకేలకు తండ్రి ముందే ఆ యువతి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఇదేం ట్విస్ట్ రా నాయనా అంటూ అవాక్కయ్యారు. అయితే యువతిపై చల్లింది యాసిడ్ కాదని.. అది టాయిలెట్ క్లీనర్ అని తేలింది. అంతేకాక యువతి చేతులకు ఏమీ కాలేదని.. బ్యాండేజీ కట్లు కట్టి ఆ ముగ్గురు యువకుల్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అబద్ధపు ఫిర్యాదు చేసి, తమ విలువైన సమయాన్ని వృథా చేసినందుకు ఆ విద్యార్థిని, ఆమె తండ్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన వెంటనే దేశ రాజధానిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీంతో వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
ఢిల్లీ విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసు : కట్టుకథ అని తెలిసి బిత్తరపోయిన పోలీసులు
الثلاثاء، 28 أكتوبر 2025
cracked the case with advanced technology like CCTV cameras at the scene and tracking the accused's phones Criem Delhi student acid attack case Police shocked after learning it was a fabrication
ليست هناك تعليقات:
إرسال تعليق