ణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీలో సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మణిపూర్‌లో కొందరు రాజకీయ నాయకుల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఓ తెగకు చెందిన ఆరుగురి మృతదేహాలు కనపడడంతో హింస చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీకి వచ్చిన వెంటనే అమిత్‌ షా సమావేశాన్ని నిర్వహించారు. మణిపూర్‌లో శాంతిభద్రతలను సమీక్షించడంపై ఈ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. అలాగే, రేపు కూడా హోం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో మరో సమావేశం జరగనుంది. భద్రతా బలగాలు, నిరసనకారులకు మధ్య కూడా ఘర్షణలు తలెత్తుతుండడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మణిపూర్‌లో మైతేయీ-కుకీ తెగల మధ్య 18 నెలలుగా తరుచూ అల్లర్లు జరుగుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్‌ ప్రయోగించాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ