జార్ఖండ్ లోని గర్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ గిరిజన సంఘం, అవినీతి, బంధుప్రీతి తదితర అంశాలపై అధికార పార్టీని తన ప్రసంగంలో ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు. జార్ఖండ్లో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను ప్రధాని మోడీ ప్రముఖంగా ప్రస్తావించారు. బీజేపీ అధికారంలోకి వస్తే 3 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. నిజానికి నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ బీజేపీని నిరంతరం కార్నర్ చేస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ విషయంపై ప్రసంగించడం ఆసక్తి రేపుతోంది. జార్ఖండ్ యువతలో ప్రతిభకు కొదవ లేదని ఆయన అన్నారు. జార్ఖండ్కు చెందిన కుమారులు, కుమార్తెలు క్రీడారంగంలోస్ఫూర్తిని చాటుతున్నారని కొనియాడారు. జార్ఖండ్ యువతలో సామర్థ్యాలను పెంచడం, వారికి కొత్త అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. కానీ జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఆర్జేడీలు జార్ఖండ్ యువతకు ద్రోహం చేశాయని ఆరోపించారు.
జార్ఖండ్ లో మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం !
الاثنين، 4 نوفمبر 2024
jarkhand national గర్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ జార్ఖండ్ లో మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం యువతలో ప్రతిభకు కొదవ లేదని
ليست هناك تعليقات:
إرسال تعليق