ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో అతి వేగంగా దూసుకెళ్లిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు సోమవారం రాత్రి చిత్తూరు నుండి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు. ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق