ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలుగురాష్ట్రాల్లో పర్యటించి వరద నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించారు. బుధవారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాని కలిసి ఆ నివేదికను అందజేశారు. ఈ మేరకు శివరాజ్‌సింగ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. త్వరలోనే కేంద్ర బృందాలు వరద ప్రాంతాలను పరిశీలిస్తాయని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుందని పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم