తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు అందజేశారు. తిరుమల ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల వేళ పలు రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా , అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను పవన్కు అందజేసిన టీటీడీ అధికారులు !
الخميس، 26 سبتمبر 2024
Andhra Pradesh అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను పవన్కు అందజేసిన టీటీడీ అధికారులు
ليست هناك تعليقات:
إرسال تعليق