వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన ముగ్గురు కీలక నేతలు గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోశయ్యలను పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమానికి వందలాది కార్యకర్తలు తరలివచ్చి, పార్టీ కార్యాలయం సందడిగా మారింది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం కారణంగా ఈ నేతలు వైసీపీలో అసంతృప్తితో బయటకు వచ్చారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో వారు పవన్ సమక్షంలో అధికారికంగా జనసేనలో చేరడంతో, ఒంగోలు, జగ్గయ్యపేట, పొన్నూరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలం మరింతగా పెరిగింది.
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق