ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు కాలినడకన అలిపిరి మార్గంలో రాత్రి 9 గంటలకు పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకోనున్నారు. 3వ తేదీ ఉదయం 8:15 నిమిషాలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. 3వ తేదీ ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల వరకు అన్నదానం సముదాయం, క్యూలైన్లను పవన్ తనిఖీలు చేయనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో పవన్ పాల్గొననున్నారు. రాత్రి 8:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరంకు పవన్కల్యాణ్ బయలుదేరుతారు.
0 Comments