టెలికాం సేవలను (మొబైల్, బ్రాడ్బ్యాండ్) నిలిపివేసేందుకు కంపెనీ వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకస్టమర్ల ప్రయోజనాల కోసం కొత్త నిబంధనను అమలు చేయబోతోంది. శుక్రవారం ట్రాయ్ జారీ చేసిన కొత్త సేవా నాణ్యత నిబంధనల ప్రకారం టెలికాం ఆపరేటర్లు జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సేవలకు అంతరాయం కలిగితే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రతి నాణ్యత బెంచ్మార్క్ను అందుకోలేకపోయినందుకు జరిమానా మొత్తాన్ని రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచింది. ఆరు నెలల తర్వాత కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రెగ్యులేటర్ సవరించిన నిబంధనల ప్రకారం వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు రూ. 1 లక్ష, రూ. 2 లక్షల జరిమానాలు విధించింది. 5 లక్షల 10 లక్షల గ్రేడెడ్ పెనాల్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త నియమాలు మూడు వేర్వేరు నిబంధనలను భర్తీ చేస్తాయి. ప్రాథమిక, సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్బ్యాండ్ సేవలు, బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ సేవల కోసం క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నెట్వర్క్ అంతరాయం ఏర్పడితే, టెలికాం ఆపరేటర్లు పోస్ట్పెయిడ్ కస్టమర్లకు ఛార్జీల రాయితీలను అందించాలి. ప్రీపెయిడ్ కస్టమర్లకు చెల్లుబాటును పొడిగించాలి. రోజులో 12 గంటల కంటే ఎక్కువ నెట్వర్క్ అంతరాయాన్ని ఒక పూర్తి రోజుగా లెక్కిస్తుంది. 24 గంటల కంటే ఎక్కువ సమయం అంతరాయం ఏర్పడితే.. పోస్ట్పెయిడ్ కస్టమర్కు ఛార్జీల రాయితీ, ప్రీపెయిడ్ కస్టమర్కు చెల్లుబాటు పొడిగించాలి. కాగా ఈ నిబంధనలు ఆరు నెలల తర్వాత కొత్త అమల్లోకి వస్తాయని తెలిపారు.
మొబైల్, బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లో అంతరాయం ఏర్పడితే వినియోగదారులకు నష్ట పరిహారం !
السبت، 3 أغسطس 2024
internet science technology టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లో అంతరాయం ఏర్పడితే వినియోగదారులకు నష్ట పరిహారం మొబైల్
ليست هناك تعليقات:
إرسال تعليق