అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి !


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా చేరుకున్నారు. శనివారం హైదరాబాద్ నుండి అమెరికాకు బయలుదేరగా సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పది రోజుల టూర్ ఉండనుంది. అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అలాగే న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు. తొలుత అమెరికా ఆ తర్వాత దక్షిణా కొరియాలో పర్యటించనున్నారు. మొత్తం పది రోజుల పర్యాటనలో భాగంగా సీఎం బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 6న ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. మూసీ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న మిగతా ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి భాగస్వాములు కావాలని కోరనున్నారు.అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కాగ్నిజెంట్‌ సీఈవో, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ సీవోవో, పెప్సీ కో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రముఖులతో సీఎం బృందం భేటీ కానుంది. అమెరికా నుండి దక్షిణకొరియాలో పర్యటించి అక్కడ పారిశ్రామిక వేత్తలను కలవనున్నారు రేవంత్. అనంతరం ఆగస్టు 14న హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేపట్టడం ఇది రెండోసారి.

Post a Comment

0 Comments