అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో అతిధిగా పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నాడు. 15వ ఎడిషన్లో ఇండియన్ ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ అవార్డును అందుకోనున్నారు. నటనా రంగంలో విశేషమైన కృషి కనబర్చిన చరణ్కు ఈ అవార్డును అందివ్వబోతుంది. ఈ అవార్డును అందుకోబోతున్న తొలి సెలబ్రిటీ రామ్ చరణ్ కావడం విశేషం. విక్టోరియన్ ప్రభుత్వం ప్రతి యేటా ఈ ఫెస్టివల్ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. ఇదిలా ఉంటే.. ఈ అవార్డు దక్కడంపై చెర్రీ స్పందించాడు. మెల్బోర్న్లో భారత జాతీయ జెండాను ఎగురవేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. గౌరవ అతిథిగా రామ్ చరణ్ హాజరు కావడం తమకు ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని ఐఎఫ్ఎఫ్ఎం ప్రెసిడెంట్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
0 Comments