భారత్, శ్రీలంకల మధ్య రామ సేతు కాల్పనికం కాదని, నిజమేనని అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్సాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ ను విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కి.మీ. మేర ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉందని వివరించారు. దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగిందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
సముద్ర గర్భంలో రామసేతు నిజమే : ఇస్రో
الاثنين، 15 يوليو 2024
national science technology అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టం అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్సాట్-2 డేటా ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు వంతెన పొడవు 29 కి.మీ. సముద్ర గర్భంలో రామసేతు నిజమే
ليست هناك تعليقات:
إرسال تعليق