భారత్ వినియోగదారుల కోసం 'స్నాప్డ్రాగన్ ఫర్ ఇండియా' ఈవెంట్ను క్వాల్కామ్ కంపెనీ మంగళవారం నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఎంట్రీ లెవల్ 5జీ హ్యాండ్సెట్ల కోసం ప్రత్యేకంగా ‘స్నాప్డ్రాగన్ 4ఎస్ జన్ 2’ ప్రాసెసర్ను క్వాల్కామ్ తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్ కారణంగా 5జీ స్మార్ట్ఫోన్ ధరలు దిగొస్తాయని తెలిపింది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తక్కువ ధరలో 5జీ ఫోన్ను అందించాలన్న ఉద్దేశంతో కొత్త చిప్సెట్ను తీసుకొచ్చినట్లు క్వాల్కామ్ చెప్పింది. స్నాప్డ్రాగన్ 4ఎస్ జన్ 2తో తొలి డివైజ్ ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశం ఉన్నట్లు క్వాల్కామ్ పేర్కొంది. షావోమి సహా మరికొన్ని మొబైల్ తయారీ సంస్థలు ఈ ప్రాసెసర్ను వినియోగించనున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల ధరలు రూ.10 వేలపైనే ఉన్నాయి. ఏ కంపెనీ మొబైల్స్ చూసుకున్నా ధరలు బాగానే ఉన్నాయి.
క్వాల్కామ్ నుంచి స్నాప్డ్రాగన్ 4ఎస్ జన్ 2 ప్రాసెసర్ !
الأربعاء، 31 يوليو 2024
'స్నాప్డ్రాగన్ ఫర్ ఇండియా' ఈవెంట్ science technology ఈ ప్రాసెసర్ కారణంగా 5జీ స్మార్ట్ఫోన్ ధరలు దిగొస్తాయని తెలిపింది క్వాల్కామ్ నుంచి స్నాప్డ్రాగన్ 4ఎస్ జన్ 2 ప్రాసెసర్
ليست هناك تعليقات:
إرسال تعليق