అలెక్సాలో జనరేటివ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. అయితే ఈ సేవలు ఉచితంగా లభించవు. యూజర్లు ఇందుకోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏఐ సేవలను ఉపయోగించుకోవడానికి సుమారు రూ. 400 నుంచి రూ. 800 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అమెజాన్ 2014లో తీసుకొచ్చిన నాటి నుంచి అలెక్సాలో తీసుకొచ్చిన పెద్ద మార్పు ఇదేనని చెప్పాలి. అలెక్సాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో అధునాతన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది యూజర్లకు మరింత కచ్చితమైన సమాధానాలు ఇవ్వనుంది. ఇప్పటి వరకు అలెక్సా అందించిన సేవలతో పోల్చితే ఈ ఏఐ సేవలు మరింత అధునాతన ఫీచర్లను అందించనున్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసేందుకు అమెజాన్ సన్నాహాలు చేస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో అమెజాన్ ప్రాజెక్ట్ బన్యాన్ పేరుతో అలెక్సాలో మార్పులు తీసుకొస్తోంది. ఇక కొత్త వెర్షన్తో యూజర్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు, ఆదాయం సమకూర్చే ఆలోచనలో కంపెనీ ఉంది.
అలెక్సాలో జనరేటివ్ ఏఐ టెక్నాలజీ ?
الأحد، 23 يونيو 2024
isro science technology అలెక్సాలో జనరేటివ్ ఏఐ టెక్నాలజీ ? ఏఐ సేవలను ఉపయోగించుకోవడానికి సుమారు రూ. 400 నుంచి రూ. 800 వరకు చెల్లించాల్సి ఉంటుంది
ليست هناك تعليقات:
إرسال تعليق