తిరుపతి నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఓ కుటుంబం హైదరాబాద్ వస్తోంది. ఈ క్రమంలో హోంగార్డు ప్రతాప్ ఎస్-3 కోచ్లో నిద్రిస్తున్న యువతి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తండ్రి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రైలు కాచిగూడ వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కోడూరు పీఎస్లో హోంగార్డుగా పనిచేస్తున్న ప్రతాప్ యూనిఫామ్లో ఉండి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. నిందితుడి స్వస్థలం కడప జిల్లా రైల్వే కోడూరు అని పోలీసులు తెలిపారు.
0 Comments